పెద్దపప్పూరు: ..... | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 12:56 AM

-

పెద్దపప్పూరు: నమ్మి ఓటేసిన వారి ఇంటికే కన్నాలు వేసి దోచుకునే రకం జేసీ సోదరులని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం తమదని చెప్పుకునే జేసీ దివాకర్‌రెడ్డి– జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు ప్రజల్లో క్రమేణా ఆదరణ తగ్గుతుండటంతో భయం పట్టుకుందన్నారు. కన్నం వేసే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట, వరదాయపల్లి, అమళ్లదిన్నె, జె.కొత్తపల్లి గ్రామాల్లో మంగళవారం ‘ప్రజా సంక్షేమ పాదయాత్ర’ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ సోదరులకు పక్కవారు ఎవరైనా బాగుపడితే అసలు నచ్చదన్నారు. దోచుకోవడం.. దాచుకోవడం తప్ప వారికి ప్రజల సంక్షేమం ఏనాడూ పట్టదన్నారు. ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయించాలని ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఎన్నికల సమయంలోనూ మొరపెట్టుకుంటున్నారన్నారు. జేసీ సోదరులు మాత్రం ఓట్ల కోసం హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత దాని విస్మరించారన్నారు. తాను 2019 ఎన్నికల ప్రచారంలో ముచ్చుకోటకు వచ్చినపుడు ప్రాజెక్టుకు నీరు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఆ మేరకే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రాజెక్టుకు నీరు విడుదల చేయించి, గ్రామంలో అడుగు పెట్టానన్నారు. గ్రామస్తులు హర్షధ్వానాలతో పెద్దారెడ్డికి మద్దతు తెలిపారు. అనంతరం ప్రజాసంక్షేమ పాదయాత్రకు ఎంపీ తలారి రంగయ్య మద్దతు తెలిపి.. ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చితేనే ఏ నాయకుడికై నా మళ్లీ ప్రజలు ఓటేసి గెలిపిస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి కె.రమేష్‌రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బీరేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement