విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి

Published Sun, Mar 19 2023 1:34 AM

వడ్డే పెద్దన్న (ఫైల్‌) - Sakshi

ఆత్మకూరు: విద్యుత్‌ స్తంభంపై నుంచి కింద పడి వ్యక్తి ప్రాణాలు విడిచిన సంఘటన ఆత్మకూరు మండలం సిద్దరాంపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన వడ్డే పెద్దన్న (35) ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసే పనులకు వెళ్లేవాడు. శనివారం సిద్దరాంపురం వద్ద పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే విద్యుత్‌ స్తంభం ఎక్కి పని చేస్తుండగా కాలు జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వడ్డే పెద్దన్నకు భార్య సుకన్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement