టిప్పర్‌ ఢీకొని వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని వృద్ధుడి మృతి

Published Sat, Sep 23 2023 2:02 AM

- - Sakshi

పెద్దపప్పూరు: యాడికి మండలంలోని రాయలచెరువు నుంచి వేములపాడు గ్రామానికి వెళ్లే జాతీయ రహదారిలో మోడల్‌ స్కూల్‌ వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొంది. ఈ సంఘటనలో పక్కీరప్ప (72) మృతి చెందాడు. వివరాలు.. తూట్రాళ్లపల్లి గ్రామానికి చెందిన పక్కీరప్ప కూలిపనికి వెళ్లి తిరిగి ఇంటికి బైక్‌పై వస్తున్నాడు. అయితే వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పక్కీరప్పను స్థానికులు 108 వాహనం ద్వారా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పక్కీరప్ప మృతి చెందాడు. మృతుడి భార్య నాగమ్మ కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు యాడికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు తలలు.. ఎనిమిది కాళ్లు

ఆత్మకూరు: ఆత్మకూరుకు చెందిన బయపరెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎనుముకు శుక్రవారం రెండు తలలు, ఎనిమిది కాళ్లు ఉన్న దూడ జన్మించింది. రైతు తెలిపిన వివరాల మేరకు... ఎనుము దూడను ప్రసవించేందుకు తీవ్ర ఇబ్బందులు పడింది. దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. 15 మంది కలసి దూడను బలవంతంగా బయటకు తీశారు. కాని అప్పటికే కడుపులోనే దూడ మరణించిందని రైతు తెలిపారు.

Advertisement
Advertisement