రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహం | Sakshi
Sakshi News home page

రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహం

Published Sun, Nov 19 2023 12:14 AM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం   - Sakshi

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ చిన్నగౌస్‌, కనగానపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 35 సంవత్సరాలున్న వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం రాత్రి అక్కడ పడేసి పెట్రోల్‌ పోసి నిప్పటించినట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు సైతం అక్కడకు చేరుకుని పరిశీలించారు. సగానికి పైగా శరీర భాగాలు కాలిపోయాయి. సమీప ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మరో ప్రాంతంలో హతమార్చి ఇక్కడ పడేసి నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు పక్కన పడేసి

నిప్పంటించిన దుండగులు

పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసులు

Advertisement
Advertisement