కేసులో రాజీకి రమ్మని బెదిరింపులు | Sakshi
Sakshi News home page

కేసులో రాజీకి రమ్మని బెదిరింపులు

Published Mon, Nov 20 2023 12:40 AM

-

అనంతపురం క్రైం: నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న అవివాహితను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరక అవసరాలు తీర్చుకున్నారన్న ఫిర్యాదుపై 2020లో దిశ పోలీసులు నమోదు చేసిన కేసులో బాధితురాలికి బెదిరింపులు మొదలయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏఆర్‌ పీసీ సుధీర్‌ను రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసును వెనక్కు తీసుకోకపోతే చంపుతామని నిందితుడు బెదిరింపులకు దిగడంతో పోలీసు స్పందనలో మరోసారి బాధితురాలు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 5 లక్షలు నగదు తీసుకెళ్లడమే కాకుండా శారీరక అవసరాలు తీర్చుకుని మోసం చేశాడని, తాజాగా బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సుధీర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, బంధువులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఏఆర్‌ పీసీ సుధీర్‌తో పాటు

బంధువులపై కేసు నమోదు

Advertisement
Advertisement