రాష్ట్రపతికి ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘన స్వాగతం

Published Thu, Nov 23 2023 12:50 AM

-

పుట్టపర్తి రూరల్‌: సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఒడిశాలోని జహర్సుగూడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి బుధవారం మధ్యాహ్నం 2.47 గంటలకు పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌, హందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, అడిషనల్‌ డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) డా.శంకభత్ర బాగ్చీ, కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవ్‌రెడ్డి, ిఎమ్మెల్సీలు మహమ్మద్‌ ఇక్బాల్‌, మంగమ్మ, భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. సాయంత్రం ఆమె తిరుగు ప్రయాణమై వెళ్లారు.

Advertisement
Advertisement