అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Published Mon, Nov 27 2023 1:50 AM

-

అనంతపురం క్రైం: స్థానిక నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పీవీకేకే కళాశాల సమీపంలో సాయి హేమలత (28) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.... పెనుకొండకు చెందిన సాయి హేమలతను కళ్యాణ్‌ అనే యువకుడికి ఇచ్చి 9 నెలల క్రితం వివాహం జరిపించామన్నారు. పెళ్లి సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారు వరకట్నం కింద ఇచ్చామని తెలిపారు. యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోందని, ప్రతి నెలా ఆమెకు వచ్చే జీతంలో ఒక్క రూపాయి కూడా ఉంచకుండా కళ్యాణ్‌ తన ఖాతాలోకి మళ్లించుకునేవాడన్నారు. అదనపు కట్నం కోసం పలుమార్లు వేధించినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కళ్యాణ్‌ తన తల్లిదండ్రులతో కలసి ఉత్తర కర్ణాటక ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లాడని, హేమలతను వెంట తీసుకెళ్లలేదన్నారు. ఈ క్రమంలో ఇంట్లో హేమలత, మరిది, వరుసకు అవ్వ అయిన ఓ వృద్ధురాలు ఉంటున్నారని, ఏం జరిగిందో తెలీదని ఆదివారం సాయంత్రం హేమలత ఫ్యాన్‌కు ఉరితాడుతో చనిపోయి కనిపించిందన్నారు. వరకట్నం వేధింపులే తమ బిడ్డ చావుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement