రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Mon, Nov 27 2023 1:50 AM

మృతుడు మాబు - Sakshi

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ... తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాబు(46), బాషా ద్విచక్ర వాహనంలో సొంత పనుల నిమిత్తం అనంతపురంకు బయలు దేరారు. బీకేఎస్‌ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ సమీపంలో బొమ్మలబావి దగ్గర అనంతపురం – తాడిపత్రి రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌ టేక్‌ చేస్తూ డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మాబు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుతున్న బాషా హెల్మెట్‌ ధరించడంతో గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement