కార్తీక వెలుగులు | Sakshi
Sakshi News home page

కార్తీక వెలుగులు

Published Mon, Nov 27 2023 1:50 AM

-

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులంతా కలసి కార్తీక వన భోజనాలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి ఊరేగించారు. ఆలయ ముఖమండపం వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత జ్వాలాతోరణాన్ని వెలిగించి, స్వామివార్ల ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.

– సాక్షిబృందం

Advertisement
Advertisement