ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు

Published Sun, Mar 28 2021 6:58 PM

1005 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,005 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,98,815 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో 324 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,86,216 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి గత 24 గంటల్లో చిత్తూరు, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 7,205 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 5,394 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటివరకు 1,49,90,039 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి:
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్ 
కోవిడ్‌ వల్ల జనగణన–2021 వాయిదా

Advertisement
Advertisement