ఏపీ: 24 గంటల్లో 8,846 మంది డిశ్చార్జ్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ: 24 గంటల్లో 8,846 మంది డిశ్చార్జ్‌

Published Thu, Aug 20 2020 6:03 PM

9,393 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 55,551 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,393 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 8,846 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం 2,35,218 మంది కోలుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 95 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు మొత్తం 3001 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,74,847 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement