ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు

Published Wed, Apr 21 2021 8:00 PM

9716 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 39,619 కరోనా పరీక్షలు నిర్వహించగా 9,716 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 3,359 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటి వరకు 9 లక్షల 18 వేల 985 మంది డిశ్చార్జ్‌‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 38 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7510 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 60,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,57,93,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
Advertisement