ఏపీ: 24 గంటల్లో 8,061మంది డిశ్చార్జ్‌ | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు

Published Wed, Aug 19 2020 5:04 PM

9,742 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,685 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,742 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16003కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 8,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 86 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,19,296 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ( భారీగా పెరుగుతున్న రికవరీ రేటు )

Advertisement
Advertisement