సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం): పడ్నా లిఖ్నా అభియాన్(అక్షరాస్యత కార్యక్రమం)లో భాగంగా చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో పడ్నా లిఖ్నా అభియాన్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదువుకుందాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువు లేని 15 ఏళ్ల వయసు దాటిన వారిని బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా అడుగులేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే అన్ని రాష్ట్రాల్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, అందుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులను విద్యాభివృద్ధికి కేటాయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికి 26 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సగానికి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, పాఠశాల విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వైస్ చైర్మన్ విజయశారదరెడ్డి, వయోజన విద్యా సంచాలకులు వై.జయప్రద తదితరులు పాల్గొన్నారు.
నూరుశాతం అక్షరాస్యత దిశగా అడుగులు..
Published Thu, Apr 8 2021 4:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement