సాక్షి, అమరావతి: రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని సినీనటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా నియమితులైన అలీ చెప్పారు. ఆయన బుధవారం సతీసమేతంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న తన కుమార్తె వివాహానికి సీఎం జగన్ను ఆహ్వానించేందుకు వచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ కార్డు సీఎంకి అందజేశానన్నారు. సీఎం జగన్ తనకు అద్భుత అవకాశం ఇచ్చారని, ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. గతంలో రాఘవేంద్రరావు ఈ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. దీనికి అలీ అయితే కరెక్ట్ అని సీఎం తనని నియమించారన్నారు.
తన వల్ల సీఎం జగన్కు ఎంతపేరు తీసుకురావాలో అంతా తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాజకీయాల్లో సహనం ఉన్న వారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్ అలా ఉండి ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటాలు చేయటం వల్లే, తిరుగులేని మెజార్టీ సాధించి, సీఎం పదవి అధిరోహించారన్నారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్లా ఉండాలని చెప్పారు.
బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం నేతలకు సరైంది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇకముందు సీఎం జగన్ ఆదేశాలను శిరసావహించి ముందుకు కదులుతానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్నారు. అన్నివర్గాల్లో పేదల కోసం, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పారు.
ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లబ్ధిపొందారన్నారు. ప్రజలు పథకాలను ఆదరిస్తున్నారని చెప్పారు. ఈసారి 175కి 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి జగన్ 2024లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ సీఎంగా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆ క్రతువులో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో సహనం ఎంతో అవసరం
Published Thu, Nov 3 2022 5:30 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
Advertisement