సాక్షి, అమరావతి / వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపచేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లలను బడికి పంపించే అర్హులైన తల్లులందరికీ ఈ పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, సీఎం అమ్మ ఒడి కార్యక్రమాన్ని తెచ్చారన్నారు.
వేర్వేరు సమస్యల వల్ల అర్హులు కాని వారి విషయంలో మరింత పకడ్బందీగా పరిశీలించాలని సీఎం సూచించారన్నారు. ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తామని, గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులుంటారని భావిస్తున్నామని చెప్పారు. ఈ పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని, నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కడుపు మంటతో చేస్తున్నవేనని కొట్టిపారేశారు. నాడు–నేడు కింద పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన ఒక నిధి ఏర్పాటుకు సీఎం యోచన చేశారని చెప్పారు. తల్లులకు అమ్మ ఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో టాయిలెట్ల నిర్వహణ నిధి కోసం రూ.1000 మినహాయించి తక్కిన మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి వివరించారు.
సాంకేతికతతో అసమానతల తొలగింపు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సమగ్ర శిక్ష, పాఠశాల విద్య సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు జరిగే ‘దీక్ష – కీ రిసోర్స్ పర్సన్’ శిక్షణ శిబిరాన్ని బుధవారం స్థానిక కేబీఎన్ కళాశాల ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ విద్య ద్వారా సామాజిక అసమానతలను తొలగించగలుగుతామన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు సాధించగలమన్నారు. నైపుణ్యాల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని చెప్పారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థల ద్వారా నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి
Published Thu, Jan 7 2021 5:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement