Andhra Pradesh: 48 గంటల్లో 9,525 పాజిటివ్‌ కేసులు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 48 గంటల్లో 9,525 పాజిటివ్‌ కేసులు

Published Mon, Jan 17 2022 3:36 AM

Andhra Pradesh 9525 Covid positive cases in 48 hours - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 48 గంటల్లో (శుక్రవారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు) 65,695 నమూనాలు పరీక్షించగా 9,525 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రెండు రోజుల్లో 1,066 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,06,280కి చేరింది. వీరిలో 20,65,000 మంది కోలుకున్నారు. 14,510 మంది మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 3,18,62,032 నమూనాలు పరీక్షించింది. 

ఆసుపత్రుల్లో 4.55 శాతం మంది
రాష్ట్రంలో వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా ఆసుపత్రుల్లో చేరుతున్న వారు మాత్రం తక్కువగానే ఉన్నారు. ఆదివారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,220 మంది మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. యాక్టివ్‌ కేసుల్లో 4.55 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు హోమ్‌ ఐసోలేషన్, క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 290 మంది ఐసీయూలో, 205 మంది సాధారణ, 668 మంది ఆక్సిజన్‌ పడకల్లో, 57 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.  

Advertisement
Advertisement