సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఉదయం ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను వెల్లడించింది.
కాగా, గత నెల 19న ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షలు జరుగుగా 1,51,288 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అర్హత సాధించారు. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాల కోసం https://slprb.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోగలరు.