AP: ఎమ్మార్వో రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల సాయం | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షలు.. ప్రకటించిన ప్రభుత్వం

Published Wed, Feb 7 2024 11:21 AM

Ap Government Announced 50 Lakhs To Mro Ramanaiah Family - Sakshi

సాక్షి, విశాఖ: హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కాగా, ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్‌ డీడ్‌ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీచదవండి.. బరి తెగించిన ఎర్ర చందనం స్మగ్లర్లు

Advertisement
Advertisement