కర్నూలు(అర్బన్): పల్లె ప్రజలు ప్రగతికి జై కొడుతున్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకతాటిపై నిలుస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కువగా ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయి. మొదటివిడత నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం ముగిసింది. 193 గ్రామపంచాయతీలకు గాను 52 సర్పంచ్, 727 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఒక్కో గ్రామంలో రూ.90 లక్షలకు పైగా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి స్పష్టంగా కని్పస్తోంది. తాజాగా ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని కూడా పెంచింది. దీనివల్ల గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రజలు కలసికట్టుగా ఏకగ్రీవాలకు ‘ సై ’ అంటున్నారు.
ఫ్యాక్షన్కు గుడ్బై
అక్షరాస్యత శాతం పెరగడం, రాజకీయంగా చైతన్యం రావడం వల్ల పలు గ్రామాల్లో యువత ఫ్యాక్షన్కు గుడ్బై చెబుతూ.. గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తోంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే డబ్బు, మద్యం ఏరులై పారేవి. పైపెచ్చు గ్రామాధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని పచ్చని పల్లెలు కాస్తా రావణ కాష్టంలా మారేవి. అయితే.. ఇటీవలి కాలంలో అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుండడంతో గ్రామీణుల దృక్పథంలోనూ మార్పువచ్చింది. కక్షలకు పోకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెజారిటీ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతుండడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘ఏక’మయ్యారు..
మొదటి విడతలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 12 మండలాలకు చెందిన 193 గ్రామ పంచాయతీలు, 1,922 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజైన 4వ తేదీ (గురువారం) సాయంత్రానికి 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇంతకంటే ఎక్కువగా ఏకగ్రీవమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తొలివిడత 52 సర్పంచ్, 727 వార్డు స్థానాలు ఏకగ్రీవం
Published Fri, Feb 5 2021 9:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement