Tirumala: 15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

తిరుమల: 15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Published Wed, Oct 4 2023 3:56 AM

Brahmotsavam of Srivari Navratri from 15 - Sakshi

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకా­రం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మో­త్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా­రు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహ­నసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇలా ఉన్నాయి.

  • ఈ నెల 14న అంకురార్పణం,
  • 15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం,
  • 16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం,
  • 17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
  • 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,
  • 19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం,
  • 20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం,
  • 21న ఉదయం సూర్య­ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,
  • 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు.
  • 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉద­యం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.77 కోట్లుగా తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,952 మంది. 

Advertisement
Advertisement