సాక్షి, అమరావతి: పంచాయతీ పోరులో ప్రజలు వైఎస్సార్సీపీ మద్దతుదారులకు జై కొట్టారని, పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో సేవా గుణం, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం ఉన్న వారినే అభ్యర్థులుగా పోటీకి నిలపాలని ఆయన సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికలపై చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ.. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ గెలిచి తీరుతుందన్నారు. గుంటూరు జిల్లా నేతలు సమష్టిగా పని చేసి ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. సమీక్షలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్రెడ్డి, ముస్తఫా, విడదల రజిని, అన్నాబత్తుని శివకుమార్, మద్దాళి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
అర్బన్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
Published Wed, Feb 24 2021 4:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement