CM YS Jagan Review Meeting On Housing Scheme - Sakshi
Sakshi News home page

పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Fri, Apr 28 2023 6:02 PM

Cm Ys Jagan Review Meeting Housing Scheme - Sakshi

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా కూడా బకాయిలు లేవు.. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం పేర్కొన్నారు.

‘‘పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి. కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి శనివారం హౌసింగ్‌ డేగా పరిగణించాలి’’ అని సీఎం ఆదేశించారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
హౌసింగ్‌ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి
దీనివల్ల అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుంది
ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు ఏసీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి

దేశంలో ఎక్కడా కూడా సమగ్ర సర్వే జరగలేదు
100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేస్తున్నాం
దేశానికి అంతటికీ ఆదర్శప్రాయమైన కార్యక్రమం
జాతీయ స్థాయిలో ఈకార్యక్రమం ద్వారా మనకు సముచిత స్థానం లభిస్తుంది
భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు పాతడం, గ్రామాల్లో భూముల రికార్డుల్లో తుది వివరాలు నమోదు, గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ సేవలు లభ్యం కావడం… ఇదీ… ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం
చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ 

మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది
దీన్ని త్వరగా పూర్తిచేయాలి
కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి
పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి
మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది

పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం
నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయి
తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి
పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి
నాడు – నేడుకు నిధుల కొరత లేదు
ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం  పూర్తి కావడంతో 15వేల కు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టు అవుతుంది
ఈ పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుంది
జూన్‌ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్‌ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి
మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు -నేడు పనులు పూర్తవుతాయి
వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాల ఉంటాయి
ఈ సమయాన్ని పనులకోసం బాగా వినియోగించుకోవాలి
కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి

మొదటి విడతలో నాడు- నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్‌ చేపట్టాలి
ఎక్కడైనా లోపాలు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దాలి
ఇంత పెద్ద మొత్తంలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం
పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
గ్రామ, వార్డు సచివాలయాలను సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
ఇసుక, సిమ్మెంటు, స్టీలు లాంటివి కొరతలేకుండా వాటి పంపిణీపై దృష్టిపెట్టాలి

8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5.18 లక్షల ట్యాబులు ఇచ్చాం
వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి
అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి
సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్‌ఓపీ రూపొందించాం
ఏమైనా సమస్యలు ఉంటే… హెడ్మాస్టర్‌కు గాని, స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లోగాని ఇస్తే.. 3 రోజుల్లోగా రిపేరు చేసి తిరిగి ఇస్తారు
ఈ ఎస్‌ఓపీ అమలు జరుగుతుందా? లేదా? అన్నది కలెక్టర్లు చూడాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు.. స్కూలుకు వెళ్లి.. అక్కడున్న ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు
నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్‌ డే పాటిస్తూ.. వారు స్కూళ్లకు వెళ్తారు
ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై వీరు శిక్షణ ఇస్తారు

స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని
ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు
దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది
పంపిణీపై మంచి ప్రోటోకాల్‌ను పాటించాలి
అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్‌ ప్రోటోకాల్‌ పాటించాలి
జగనన్న విద్యాకానుకపై ఏ స్కూలు నుంచైనా, ఏ విద్యార్థినుంచైనా నాకు ఫిర్యాదులు రాకూడదు
స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలని

గతంలో ఎప్పుడూ పుస్తకాలు టైముకు ఇచ్చేవారు కాదు:
అక్టోబరు, నవంబరు వచ్చినా.. అవి పిల్లలకు అందేవి కావు:
మనం వచ్చాక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం:
మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకు వచ్చాం:
స్కూళ్లలో పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి:
అలాగే పాఠశాల్లో నైట్‌ వాచ్‌మెన్లును నియమించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి
ప్రతి కాలేజీలోకూడా ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి
వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెట్టాలి
జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలి
మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి
కాలేజీల్లో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి
చదవండి: బుల్లెట్‌ ట్రైన్‌లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్‌

వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి
పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు. రవాణా చేస్తున్నారు, పంపిణీచేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి
గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి
15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు
వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి

Advertisement
Advertisement