శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లకు సీఎం జగన్‌ విషెస్‌ | Sakshi
Sakshi News home page

అతిపెద్ద బాధ్యత మీపై ఉంది.. యువ ఐపీఎస్‌లకు సీఎం జగన్‌ విషెస్‌

Published Tue, Oct 18 2022 11:56 AM

CM YS Jagan Wishes Training Finished IPS Officers - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్‌ వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేశారు. 

విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో యువ ఐపీఎస్‌లు ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement