సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 3,064 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 52,622కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం ఉ. 9 గంటల నుంచి మంగళవారం ఉ.9 గంటల వరకు 62,979 పరీక్షలు చేయగా 7,948 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,148గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 17,49,425 శాంపిల్స్ను పరీక్షించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు :