టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు   | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు  

Published Thu, Feb 23 2023 4:57 AM

Court summons to TDP leaders JC brothers - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్‌–3 వాహనాలకు బీఎస్‌–4గా నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్‌ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయ­వాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచా­ర­ణకు హాజరు­కావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. 

Advertisement
Advertisement