Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Mar 27 2024 8:45 AM

Devotees Rush Normal At Tirumala - Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో  10 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 68,563   మంది స్వామివారిని దర్శించుకోగా 21,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.  4.91  కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు  8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

Advertisement
Advertisement