ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Published Sat, Mar 30 2024 2:41 AM

Extension of application deadline for admissions in ideal schools - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశా­ల­కు ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహి­స్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమి­షన­ర్‌ సురేశ్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆయా మండలా­ల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం ద­రఖాస్తు గడు­వును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాç­Üం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.­gov.in/­­­apms.ap.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement