మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం  | Sakshi
Sakshi News home page

మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం 

Published Thu, Apr 27 2023 5:01 AM

Former MP Undavalli Arunkumar on the challenge of TDP leader GV Reddy - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్‌కు తా­ను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. తూర్పు­గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గ­దర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గ­దర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్‌ విసురు­తున్నారని చెప్పారు.

తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనక­పోయి­నా ఫర్వాలేదన్నారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాల­యంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు.  జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమా­లపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. 

Advertisement
Advertisement