విద్య.. ప్రపంచాన్ని మార్చే ఆయుధం | Sakshi
Sakshi News home page

విద్య.. ప్రపంచాన్ని మార్చే ఆయుధం

Published Mon, Feb 19 2024 6:03 AM

Governor Justice Abdul Nazir at closing ceremony of SGEC Silver Jubilee - Sakshi

గుడ్లవల్లేరు (గుడివాడ): ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయు­ధం విద్యే అని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన శేషా­ద్రి­రావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ(ఎస్‌జీఈసీ) రజతోత్సవాల ముగింపు సభకు ఆయన ఆదివారం హాజరయ్యారు. అబ్దుల్‌ కలాం చెప్పిన ప్రపంచ పురోగతి సాధించాలంటే అది విద్య అనే శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దానికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యం, దూర దృష్టి, అభిరుచి, ఆలోచనా దృక్పథాలతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలను స్థాపించడం హర్షదాయక­మన్నారు. తొలుత కాలేజీ స్థాపనతో పాటు అభివృద్ధి చేసిన వ్యవస్థాప­కుడు వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావుకు కృతజ్ఞతాంజలి తెలి­పిన పత్రాన్ని వారి కుటుంబ సభ్యు­లకు గవర్నర్‌ అందజేశారు. గవర్నర్‌­ను కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ వల్లూరు­పల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూ­రుపల్లి సత్యనారా­యణ, సహ కార్య­దర్శి వల్లూరుపల్లి రామకృష్ణ సన్మా­నించారు. కలెక్టర్‌ పి.రాజాబాబు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదిత­రులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement