సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు చేసే పనులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.6,182.20 కోట్లతో బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు వంటి నిర్మాణాలతో కాలువను, 8 పంప్హౌస్లను విస్తరించే పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి 73–75 రోజుల్లోనే హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.
కృష్ణానదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున.. 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల ప్రభావం వల్ల శ్రీశైలానికి కృష్ణానది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కసారిగా గరిష్ఠంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న వరద నీటిని గరిష్ఠ స్థాయిలో ఒడిసి పట్టి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలిదశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని గత నెల 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ జలవనరులశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం జలాశయం నీటిని మల్యాల పంప్హౌస్ నుంచి 8 దశల్లో నీటిని హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువలో 216.3 కి.మీ. పొడవున తరలించి జీడిపల్లి రిజర్వాయర్కు చేరుస్తారు. మల్యాల పంప్హౌస్కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ చానల్ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్ చానల్తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపడుతోంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది.
రూ.6,182 కోట్లతో హంద్రీ–నీవా కాలువ వెడల్పు
Published Tue, Jun 8 2021 3:45 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
ఇద్దరికి నోటీసులు
ఆస్తి గొడవల్లో చిన్నాన్న హత్య
మహా మానవతావాది బసవణ్ణ
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్కు కట్టుదిట్ట భద్రత
ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం
ఫ్యాన్ ఫుల్ స్పీడ్
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
తప్పక చదవండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- వరుస నష్టాలకు బ్రేక్
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
Advertisement