ఎరువుల అక్రమ రవాణాకు చెక్‌ | Sakshi
Sakshi News home page

ఎరువుల అక్రమ రవాణాకు చెక్‌

Published Wed, Sep 13 2023 3:51 AM

Harikiran: check on smuggling of fertilisers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రా­నికి కేటా­యించిన ఎరు­వులు ఇతర రాష్ట్రా­లకు అనధికారిక రవాణా జరగ­కుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవ­సాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యా­లయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికా­రులతో మంగళ­వారం నిర్వహించిన వీడియో కాన్ఫ­రెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగు­తు­న్నట్టు గుర్తించామన్నారు.

దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్‌ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజి­లెన్స్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సహ­కారంతో సరి­హద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పా­టు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్‌ ద్వారా రికార్డు చేయాలని అధికా­రులను ఆదేశించా­రు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నా­యని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

ముమ్మరంగా వ్యవసాయ పనులు
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్‌ చెప్పారు.  గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 50 మంది రైతులతో  26 రైతు ఉత్పత్తిదా­రుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసు­కో­­వాల­న్నారు.

ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ఉత్పత్తుల సర్టిఫి­కేషన్‌ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్‌ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని  సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్‌ ద్వారా ఈ–క్రాప్‌ నమోదు చేయాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement