77th Independence Day:CM Jagan Hoists National Flag at Indira Gandhi Municipal Stadium - Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే: సీఎం జగన్‌

Published Tue, Aug 15 2023 9:01 AM

Independence Day:CM Jagan Hoists National Flag at Indira Gandhi Municipal Stadium - Sakshi

LIVE UPDATES:

► స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా  ఏపీ పోలీసులకు మెడల్స్‌ ప్రదానం చేసిన సీఎం జగన్‌

►అధికారులకు మెడల్స్‌ ప్రదానం చేసిన సీఎం జగన్‌

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో  సీఎం జగన్‌ ప్రసంగం

►రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు
►రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు
►గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎంవోయూలు
►కొత్తగా ప్రారంభమైన ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995

►శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ
►139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు
►50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి
►2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

►రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభం
►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి
►ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు మనమే నంబర్‌వన్‌

►పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమే
►పేదలు ఇంగ్లీష్‌ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే
►పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే
►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశాం

►విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాం
►నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు
►గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగీష్‌ మీడియం అమలు
►3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానం
►ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం

►భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన
►రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నాం
►డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్సమెంట్‌
►ట్రిపుల్‌ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్‌ పోస్టుల భర్తీ

►వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ
►రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నాం
►108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు

►పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే
►పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే.
►పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం
►పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చాం
►98.5 శాతం వాగ్దానాలను అమలు చేశాం

►పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశాం
►మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశాం.
►భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టాం
►వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం

►వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయి.
►2025 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
►వెలిగొండలో మొదటి టన్నెల్‌ పూర్తి చేశాం
►రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయి.

►సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపాం.
►ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత.
►వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం.
►కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం.
►అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం.

►అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు.
►రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నాం.
►విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నాం.
►రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు.
►రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం.

►గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.
►ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు.
►అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం

►గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చాం
►సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నాం.
►2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. 
►ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు

►స్వాతంత్ర్య  సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోంది: సీఎంజగన్‌
►76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించింది.
►వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించింది.

►50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.
►గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు తెచ్చాం.
►పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగాం.
►గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చాం

►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన

►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్‌

► ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు
►జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌
►సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్‌

► కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకోనున్న సీఎం జగన్‌.
►జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం జగన్‌
►రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు.
►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన
►సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం
►సాయంత్రం 5.30 ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్‌

►స్వాతంత్య్ర దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.

►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం

►ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్‌

►ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement