సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్లో డిమాండ్కు తగినట్టుగా అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాల ఎరువులూ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈనాడు సహా పలు పత్రికల్లో సత్యదూరమైన వార్తలు ప్రచురిస్తూ రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఈ అంశంపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) యూరియా నిర్ధారిత ధరలకే విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సీజన్లో ప్రధానమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు రైతులకు కావాల్సిన దానికన్నా అధికంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి రైతుకూ అవసరాలకు అనుగుణంగా ఎరువులు ఇవ్వాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఆర్బీకేలతో పాటు బయటి మార్కెట్లో ఎరువులను నిర్ధారిత ధరలకే విక్రయిస్తున్నారని చెప్పారు. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టి రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఎంఆర్పీ మించి విక్రయిస్తున్న ఎరువుల డీలర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, వారి లైసెన్సు రద్దు చేసేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొన్ని పత్రికలు పిచ్చి రాతలు రాస్తూ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులు నమ్మవద్దని కోరారు. ఫాం–1 లైసెన్సులను మాన్యువల్గా కాకుండా ఈ–ఆఫీసు విధానంలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎరువుల సంబంధిత సమస్యలు ఎదురైతే ఆయా వ్యవసాయాధికారులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత వివరాలను ఆయన వెల్లడించారు.
రైతుల్లో గందరగోళం సృష్టించకండి
Published Sun, Aug 29 2021 4:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement