జీవోను రాజకీయ కోణంలో చూడకండి | Sakshi
Sakshi News home page

జీవోను రాజకీయ కోణంలో చూడకండి

Published Thu, Jan 12 2023 4:25 AM

Many intellectuals opinion GO number 1 - Sakshi

ఏయూ క్యాంపస్‌: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయ­పడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూని­­వర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణా­లకు రక్ష జీవో నంబర్‌ 1’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమా­వేశం నిర్వహించాయి.

ప్రభుత్వం ప్రజల ప్రాణా­లను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకు­వచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్య­క్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్‌ ఎ.కె.­ఎం.పవార్, ఆచార్య ఎన్‌.సత్యనారాయణ, డాక్టర్‌ రాజ­మాణి­క్యం, డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, డాక్టర్‌ బాల­కోటయ్య, డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజు, డాక్టర్‌ ఎ.సీతా­రత్నం, డాక్టర్‌ రాజ్‌కుమార్, తదితరులు ప్రసంగించారు.

జీవో నంబర్‌ 1 మన బాధ్య­తను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు.
– ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్, అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్, ఏయూ

ప్రజల ప్రాణాలకు నష్టం జరగ­కుండా సమావేశాలు పెట్టుకోవ­చ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపి­స్తోందని ప్రచారం చేయడం సరికాదు.
– ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్‌ కళాశాల

ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవా­లని జీవో స్పష్టం చేస్తోంది. 
– ఆచార్య ఎన్‌.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త

విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. 
– ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్‌ విభాగం

ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్‌ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి.
– ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్‌ఈ

జీవో నంబర్‌ 1 అప్రజా­స్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘట­నలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసు­కువచ్చారు. 
– ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్‌ వర్క్‌ విభాగం

నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి. 
– పాకా సత్యనారాయణ, న్యాయవాది

ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధా­నం. ప్రతిపక్షాలు అనవ­సర రా­ద్ధాం­తం చేయడం అర్థర­హితం. 
– ఆచార్య విజయ్‌­మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు

కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడు­తున్నారు. ఇది సరికాదు. 
– ఆచార్య ఎస్‌.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి

అన్ని పార్టీలకు ఈ జీవో వర్తి­స్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది?
– ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ 

Advertisement

తప్పక చదవండి

Advertisement