చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు | Sakshi
Sakshi News home page

చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు

Published Sun, May 21 2023 5:26 AM

Moderate rains for next 3 days in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే మూడ్రోజులు రాష్ట్రం­లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలిక­పాటి వర్షాలు కురుస్తాయని వాతావ­రణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బిహార్‌ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్‌ మీ­దుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ తెలి­పారు.

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూ­లు, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగు­లతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సోమవారం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు  కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

Advertisement
Advertisement