సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. కానీ ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడంతో సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఇటీవల ఆమోదించింది. వీటి అభివృద్ధికి రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీనిపై రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ తుది ఆమోదం తెలిపితే తదుపరి ప్రక్రియను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని భావిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఆధునికీకరణ, వసతులకు ప్రాధాన్యం
గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మల్టీప్లెక్స్లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇండోర్ గేమ్స్ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి. కానీ ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లకు కొత్తరూపు ఇవ్వడం, ప్రయాణికుల వసతులు మెరుగుపరచడం వంటి పనులతోపాటు భద్రతకు ప్రాధాన్యమివ్వనున్నారు. అందుకోసం ప్రయాణికులకు వసతులు, ఇంటర్మోడల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ, ఆహ్లాదకర అంశాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రైల్వే సమాచార వ్వవస్థ అనే ఆరు కేటగిరీల కింద అభివృద్ధి చేయనున్నారు.
రైల్వే స్టేషన్లలో కల్పించనున్న వసతులు
► ప్రాంత విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్కు కొత్తరూపు తీసుకొస్తారు.
► రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టంతో అనుసంధానిస్తారు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానింగ్ వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుతోపాటు రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమిస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు.
► స్టేషన్లోనే ఇంటర్ఫేసెస్, స్వైపింగ్ టికెట్ మెషిన్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు.
► అన్ని ప్లాట్ఫామ్లపై ఎస్కలేటర్లు, ప్రధాన ద్వారం వద్ద తగినన్ని ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతారు.
► ఇంటర్మోడల్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోరిక్షాల కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్ను నెలకొల్పుతారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్ నుంచి ఆ ప్రత్యేక మార్గంలో బయటకు వచ్చి బస్స్టేషన్, విమానాశ్రయంతోపాటు ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు.
► రైల్వేస్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్ఫాంలను విశాలంగా తీర్చిదిద్దుతారు. ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్ను అందుబాటులో ఉంచుతారు. మందుల దుకాణాలు, రిటైల్ దుకాణాలు, ఏటీఎంలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు.
రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
Published Mon, Apr 18 2022 5:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement