సాక్షి, అమరావతి : ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను ఖర్చుకు వెనకాడకుండా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఉక్రెయిన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఆ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర విద్యార్థులను ప్రభుత్వ ఖర్చుతో స్వస్థలాలకు చేర్చాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు భారత ప్రభుత్వం ఉచితంగా విమానాల్లో తీసుకు వస్తుండగా, అక్కడి నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో రాష్ట్రం తరఫున రెండు రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై రిసెప్షన్ కేంద్ర బాధ్యతలను రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ రామకృష్ణ, ఢిల్లీ బాధ్యతలను రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షుకు అప్పజెప్పామని తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి వచ్చే వారు ఈ రిసెప్షన్ కేంద్రాలను సంప్రదిస్తే.. వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఉచిత భోజన, ప్రయాణ వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. శనివారం వచ్చే రెండు ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి చెందిన 22 మంది ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపిందనీ, అయితే వారిని సంప్రదిస్తే అందులో చాలా మంది ఇతర రాష్ట్రాలవారున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలు సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎక్కడి వారు అక్కడే ఉండండి..
ఉక్రెయిన్లో ఉన్న మన వాళ్లందరూ కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చే సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తొలుత సరిహద్దు దేశాల వద్దకు చేరితే, అక్కడి నుంచి తరలిస్తామని భారత ప్రభుత్వం చెప్పిందని, అయితే ఇప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కృష్ణబాబు సూచించారు. విద్యార్థులు ఎటువంటి సాహస కార్యక్రమాలు చేయకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలన్నారు.
ఏ విధంగా ఎక్కడికి రావాలో భారత ఎంబసీ చేసే సూచనలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు, సలహాలు చేరవేయడం కోసంఉక్రెయిన్లో ఉన్న తెలుగు వారి కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ గ్రూపులో 300 మంది సభ్యులుగా చేరినప్పటికీ, వాస్తవంగా ఇప్పటి వరకు 212 మంది రాష్ట్ర విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువస్తుందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు.
క్షేమంగా చేరుస్తాం..
Published Sun, Feb 27 2022 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement