Sakshi News home page

వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్‌ 

Published Wed, Jul 26 2023 5:43 AM

NABARD is the backbone of agriculture sector development - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ గ్రా­మీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పర­పతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పా­రు.

నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఆర్‌.గోపాల్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌­కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూల­ధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్‌ సందర్శించి నాబార్డు కార్యక­లాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement