Sakshi News home page

వైఎస్‌ భారతికి చిత్రపటం బహూకరణ

Published Fri, Jul 8 2022 7:18 AM

Save Girl Child Project President Present Photo frame to YS Bharathi reddy - Sakshi

సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.. సాక్షి దినపత్రిక, టీవీ, భారతి గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతికి ఆమె చిత్రాన్ని ప్రొద్దుటూరుకు చెందిన సేవ్‌గర్ల్‌ చైల్డ్‌ ప్రాజెక్టు అధ్యక్షుడు తుపాకుల రామాంజనేయరెడ్డి అందించారు. గురువారం పులివెందులలో వైఎస్‌ భారతిని రామాంజనేయరెడ్డి కలిశారు. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ ప్రాజెక్టులో భాగంగా తాము చేపట్టిన చైతన్య కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్టిస్టు కుమారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

చదవండి: (YSR Kadapa: వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం)

Advertisement
Advertisement