సీఎం వైఎస్‌ జగన్‌తో ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌’ ప్రతినిధులు భేటీ | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ప్రతినిధుల భేటీ.. ఏపీలో పెట్టుబడులపై చర్చ

Published Tue, Aug 30 2022 3:41 PM

Tata Advanced Systems Representatives Met With AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో  టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారు. అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్‌ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీ ఉన్నారు.

ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్‌ అహూజా

Advertisement
Advertisement