Three Helicopters Flew Over The Hills Of Tirumala - Sakshi
Sakshi News home page

తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు..

Published Tue, Apr 25 2023 5:20 PM

Three Helicopters Flew Over Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్‌ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. అయితే ఇవి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవని సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్లే సమయంలో తిరుమల మీది నుంచి ప్రయాణించినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కన్పించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్‌ అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదనే నిబంధన ఉంది.
చదవండి: తిరుమలలో పాముల కలకలం

Advertisement

తప్పక చదవండి

Advertisement