అశ్వవాహనంపై ఆనంద నిలయుడు | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై ఆనంద నిలయుడు

Published Tue, Sep 26 2023 5:54 AM

Tirumala Srivari Brahmotsavam - Sakshi

తిరుమల: తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని­మిదో రోజు సోమవారం శ్రీవేంకటేశ్వరుడు మ­హా­రథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. గుర్రా­లు వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడు­తో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వా­రా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు.చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా.. గోవిందా.. అంటూ మహారథం మోకు (తాడు)ను లాగు­తూ భక్తి తన్మయత్వం చెందారు. వాహన సేవ తర్వా­త సుమా­రు గంట పాటు పండితులు నిర్వహించిన వేద­­గోష్టితో తిరుమల సప్తగిరులు పులకించాయి.

టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి రథం లాగారు.రాత్రి చల్లటి గాలు­ల మధ్య మలయప్ప స్వామి అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. బంగారు, వజ్ర, వైఢూ­ర్య ఆభరణాలు, విశేష పుష్పాలంకరణానంతరం స్వా­మి వా­రు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తుర­గ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమా­ల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. 

నేడు చక్రస్నానం  
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం తెల్లవారుజాము 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9 నుంచి 10  గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Advertisement
Advertisement