నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. | Sakshi
Sakshi News home page

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

Published Sat, Apr 20 2024 4:28 AM

Today siddham meeting bus route map  - Sakshi

ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం

మధ్యాహ్నం అచ్యుతాపురం వద్ద భోజన విరామం

సాయంత్రం చింతపాలెం వద్ద బహిరంగ సభ

చిన్నయపాలెం వద్ద రాత్రి బస 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజైన శనివారం(ఏప్రిల్‌ 20) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. 

కాకినాడ జిల్లా సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘కాకినాడ జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో బస్సు యాత్రలో పాల్గొని సీఎం జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.  –సాక్షి, అమరావతి 

Advertisement
Advertisement