సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ | Sakshi
Sakshi News home page

AP: సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

Published Mon, Jun 26 2023 6:30 PM

Under Training AP Cadre IAS Meets CM Jagan At Tadepalli Office - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ క్యాడర్‌కు చెందిన 10 మంది ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ (2022 బ్యాచ్‌) సోమవారం కలిశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు సీఎం మార్గనిర్ధేశం చేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో  బి.స్మరణ్‌ రాజ్‌, బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, కల్పశ్రీ కే.ఆర్‌,  కుషల్‌ జైన్‌, మౌర్య భరద్వాజ్‌, రాఘవేంద్ర మీనా, సౌర్యమన్‌ పటేల్‌, తిరుమణి శ్రీ పూజ, వి.సంజనా సింహా ఉన్నారు.
చదవండి: ‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను.. మీరు చాలా సాయం చేశారు’

Advertisement
Advertisement