సీఎం జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Published Tue, Mar 15 2022 10:43 AM

Vellampalli Srinivas And YV Subbareddy Meet YS CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు మంగళవారం కలిశారు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.


చదవండి: అది చంద్రబాబు కుట్రే

Advertisement
Advertisement