సాక్షి, అమరావతి: మేనిఫెస్టోనే కరదీపికగా.. సమన్యాయం, సమగ్రత, సమానత్వం ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పాలన అందిస్తున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలు ఉచితాలు కావని.. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. ఏ కులమైనా.. ఏ మతమైనా.. అందరికీ ఒకే గౌరవం ఉండాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతమని ఆయన స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన విజయసాయిరెడ్డి మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, పింగళి వెంకయ్య, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజులతో పాటు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతిఒక్కరికీ ఒకే విధమైన న్యాయం అందాలన్నదే వైఎస్సార్సీపీ మొదటి సిద్ధాంతమన్నారు. రెండోది.. దేశ సమగ్రత అని, గతంలో మత ప్రాతిపదికన దేశం ఎలా విడిపోయిందో, భవిష్యత్తులో విభజన జరగకుండా అందరూ సమైక్యంగా ఉండాలన్నారు.
మూడోది.. సమన్యాయమని, సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలు ధనికులతో సమానంగా అభివృద్ధి చెంది, అందరికీ ఒకే రకంగా గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకురావాలనేది వైఎస్సార్సీపీ, సీఎం జగన్ సిద్ధాంతమని వివరించారు. శాసన మండలిలో చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, మొండితోక అరుణ్కుమార్, పోతుల సునీత, శాసన మండలిలో విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మాట్లాడారు. అంతకుముందు.. జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.
పథకాలు ఉచితాలు కావు.. భవిష్యత్తుకు పెట్టుబడి
Published Tue, Aug 16 2022 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement