Sakshi News home page

14న సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

Published Tue, Dec 12 2023 4:51 AM

Ys jagan mohan reddy visit to Srikakulam district on December 14th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 14న సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవ­రం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకు­ళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు.

ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారం­భి­స్తారు. పలాస చేరుకుని వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజర­వుతారు. తిరుగు ప్రయాణమై తాడేపల్లి చేరుకుంటారు. 

Advertisement
Advertisement