YSSRCP Fans won In Nimmagadda Ramesh's Hometown In Duggirala - Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ ఊరులో వైఎస్సార్‌సీపీ అభిమానుల హవా

Published Wed, Feb 10 2021 4:00 AM

YSRCP Won In Duggirala Panchayat Election - Sakshi

సాక్షి, తాడేపల్లి రూరల్‌ (దుగ్గిరాల): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గృహం ఉన్న వార్డులో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు. గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైఎస్సార్‌సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి. 

చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ..)

(టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే)

(తొలివిడతపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి)

Advertisement
Advertisement