● బైక్‌, కారు ఢీకొని.. | Sakshi
Sakshi News home page

● బైక్‌, కారు ఢీకొని..

Published Thu, Mar 9 2023 4:10 AM

ప్రమాద దృశ్యం - Sakshi

రాయచోటిటౌన్‌ : బైక్‌, ఇన్నోవా కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణానికి చెందిన రెహమాన్‌ ఆదాన్‌ (18), బొగ్గుల నరేష్‌ (18) పల్సర్‌ బైక్‌పై మల్లూరమ్మ జాతరకు బయలుదేరారు. మదనపల్లె మార్గంలో వస్తుండగా ఇన్నోవా కారు (ఏపీ03 బీసీ 1919) వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళుతున్న రెహమాన్‌లకు తలకు బలమైన గాయాలయ్యాయి.చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ ఒంటేరు రెడ్డి వంశీ, బొగ్గు నరేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement